ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఎంపిక

Picture of Victory Media Tv

Victory Media Tv

నవ్యాంధ్రప్రదేశ్ లో బీజేపీ నూతన సారథిగా పీవీఎన్ మాధవ్ ఎంపికతో పార్టీలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గత కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, పార్టీ అధిష్ఠానం మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్‌ను రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఖరారు చేసింది . ఈ నిర్ణయం రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పును అధికారికంగా ధ్రువీకరించింది..జూలై 1, మంగళవారం నాడు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కర్ణాటక ఎంపీ మోహన్‌ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ఈ క్రమంలో, పీవీఎన్ మాధవ్ సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు..

పీవీఎన్ మాధవ్: సుదీర్ఘ అనుభవం, రాజకీయ వారసత్వం

పీవీఎన్ మాధవ్ పార్టీలో, దాని అనుబంధ సంస్థలలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు పార్టీ నిర్మాణం, కార్యకలాపాలపై లోతైన అవగాహన ఉంది. గతంలో ఆయన శాసన మండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ) కీలక సేవలందించారు. ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి పార్టీ గళాన్ని బలంగా వినిపించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
(ఆర్ ఎస్.ఎస్ )లో చురుకుగా పనిచేస్తూ, దేశభక్తి, సేవా భావాలను అలవర్చుకున్నారు. RSS శిక్షణ ఆయన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాది వేసింది. ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చా (బి జె వై ఎమ్ )లో కూడా పనిచేసి యువతలో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ అనుభవాలన్నీ ఆయనకు పార్టీలో వివిధ స్థాయిలలో పనిచేసిన అనుభవాన్ని అందించాయి, ఇది ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికిదోహదపడుతుంది.

Leave a Comment

Leave a Comment