ఇటీవలి కాలంలో ఎప్పుడూ రానంత అతి పెద్ద భూకంపం ఆగ్నేయాసియా దేశాల్లో వచ్చింది. 7.7 శాతం మేర భూకంప తీవ్రత నమోదు కావడంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. మయన్మార్లో భూకంప కేంద్రం ఉంది. రెండు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం వచ్చినట్లుగా నిపుణులు వెల్లడించారు. ఈ భూకంపం విలయం సృష్టించింది. కొన్ని వేల భవనాలు నేలమట్టమయ్యాయి. మయన్మార్, థాయల్యాండ్లో ఘోరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ.
