కూటమి విజయం కోసం పని చేసిన.. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి పదవులు పంపిణీ చేసే విషయంలో కసరత్తు చాలా క్లిష్టంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దరఖాస్తులు తీసుకుని..పార్టీ నేతల సమాచారం తెప్పించుకుని.. అన్ని రకాలుగా కసరత్తు చేసినా కేవలం 47 మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రకటించారు. ఇందులో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు ఇచ్చారు. డైరక్టర్ పోస్టులకు కూడా ఆ ఫార్ములా ప్రకారమే పదవులు ఇచ్చారు.
