సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు చెన్నైకి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లనున్నారు. మీనంబాక్కంలోని పాత ఎయిర్పోర్టులో వీఐటీ గేట్ నుంచి నేరుగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్కు చేరుకుంటారు. అక్కడ జరిగే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ (ఏఐఆర్ఎస్ఎస్)- 2025లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
