విశాఖలో లులు మాల్ కు ముందడుగు

Picture of Victory Media Tv

Victory Media Tv

విశాఖపట్నంలో మళ్లీ లులూ మాల్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 218లోనే ప్రారంభం కావాల్సిన నిర్మాణం జగన్ అధికారంలోకి రాగానే తరిమేయడంతో ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని ఆ సంస్థ ప్రకటించింది. అయితే చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. తాజాగా ఆ సంస్థకు విశాఖ వీఎంఆర్డీఏ ద్వారా 14 ఎకరాలు కేటాయించేలా ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ మాల్, భారీ కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మించనున్నారు.

లులూ గ్రూప్ భారతదేశంలో తమ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తోంది, ఇప్పటికే కేరళ , తెలంగాణ వంటి ప్రాంతాల్లో మాల్‌లను నిర్మించింది. విశాఖపట్నం వంటి నగరంలో మాల్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తోంది. విశాఖపట్నం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడం, ప్రభుత్వం నుండి పెట్టుబడులకు ప్రోత్సాహకాలు లభించనుండటంతో వేగంగా మాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లులు భావిస్తోంది.

Leave a Comment

Leave a Comment