ఇస్లాం మతంలోకి మారేందుకు, వివాహం చేసుకునేందుకు నిరాకరించినందుకు 35 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్లోని నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు భాగ్యశ్రీ నామ్దేవ్ ధనుక్ ఇంట్లో ఉండగా షేక్ రాయీస్ (42) అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి గొంతు కోశాడు. అనంతరం కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మతమార్పిడి, వివాహం కోసం రాయీస్ చాలా కాలంగా తన సోదరిని వేధిస్తున్నాడని, జుట్టు పట్టుకుని ఈడ్చేవాడని, కొట్టేవాడని, దారుణంగా హింసించేవాడని బాధితురాలి సోదరి సుభద్రబాయి తెలిపారు. మతమార్పిడికి, అతనితో పెళ్లికి నిరాకరించడంతో రాత్రి ఇంట్లోకి చొరబడి గొంతు కోశాడని వివరించారు.
