షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నప్పటి వరకు ఆ దేశంతో భారత్ బంధాలు బలంగా ఉన్నాయి. ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రెండు దేశాల మధ్య బంధాలు నానాటికీ బలహీనపడుతున్నాయి. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత్ వ్యతిరేక వైఖరితో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. చైనా, పాకిస్థాన్ లకు బంగ్లాదేశ్ దగ్గరవుతోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ భేటీ అయ్యారు.
